AP Corona Update: కరోనా మహమ్మారి ప్రభావం ఏపీలో గణనీయంగా తగ్గుతోంది. తొలిసారిగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 శాతం కంటే తక్కువకు నమోదయ్యాయి. కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో కర్ఫ్యూ వేళల్లో కూడా సడలింపులు ప్రారంభమయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)ఉధృతితో విలవిల్లాడిన ఏపీ..ఇప్పుడు తేరుకుంటోంది. రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదయ్యే పరిస్థితి నుంచి 2 వేల 6 వందల కేసులకు చేరుకుంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ వేళల్లో పెద్దఎత్తున సడలింపులిచ్చింది. ఉభయ గోదావరి జిల్లాలు తప్పించి మిగిలిన రాష్ట్రమంతా కేవలం నైట్ కర్ఫ్యూ(NIght Curfew)కొనసాగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 91 వేల 677 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..కేవలం 2 వేల 665 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అంటే కేసుల సంఖ్య 3 శాతం కంటే తక్కువే ఉన్నాయి. 


గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 16 మంది మరణించగా..ఇప్పటి వరకూ రాష్ట్రంలో 13 వేలమంది మృత్యువాత పడ్డారు. మరోవైపు గత 24 గంటల్లో 3 వేల 231 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 18 లక్షల 78 వేల 266 మందికి కరోనా సోకింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 2 కోట్ల 29 లక్షల 86 వేల 288 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు (Covid19 Tests)చేశారు. రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 529 కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 353, పశ్చిమ గోదావరి జిల్లాలో 293, ప్రకాశం జిల్లాలో 285, కృష్ణా జిల్లాలో 281 కేసులు వెలుగు చూశాయి.


Also read: Polavaram project: పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook