AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూ కారణంగా మొన్నటి వరకూ తీవ్రంగా ఉన్న కరోనా వైరస్ సంక్రమణ ఇప్పుడు గణనీయంగా తగ్గింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా కేవలం నైట్ కర్ఫ్యూ అమలు కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఉధృతి గణనీయంగా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం(Ap government)అమలు చేస్తున్న కర్ఫ్యూ కారణంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గత కొద్దిరోజులుగా కేవలం 3 శాతం లోపే కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కేవలం 1578 కరోనా కేసులు మాత్రమే వెలుగు చూశాయి. అటు 22 మంది మరణించగా..ఇప్పటి వరకూ కరోనా వైరస్ కారణంగా 13 వేల 24 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27 వేల 195 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 18 లక్షల 81 వేల 307 మంది కోవిడ్ 19 నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 3 వేల 41 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 305, చిత్తూరులో 257, నెల్లూరులో 179 కరోనా కేసులు నమోదయ్యాయి.


రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇవాళ్టి నుంచి అన్ని జిల్లాల్లోనూ ఒకే విధంగా కర్ఫ్యూ వేళల్లో సడలింపులు(Curfew Relaxations) ఇచ్చారు. ఇవాళ్టి నుంచి రాష్ట్రమంతా కేవలం నైట్ కర్ఫ్యూ(Night Curfew) కొనసాగనుంది. ఉదయం 9 గంటల్నించి రాత్రి 9 గంటల వరకూ కర్ఫ్యూ మినహాయింపు ఉంటుంది. 


Also read: Ys Jagan Review: కోవిడ్ నివారణ చర్యలపై వైఎస్ జగన్ సమీక్ష, కర్ఫ్యూ వేళల్లో మార్పులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook