ప్రేమకథల దర్శకుడిగా ముద్రపడ్డ వెంకీ అట్లూరి రీసెంట్ గా సరికొత్త ప్రేమ కథ ను అనౌన్స్ చేశారు. ఈ సరికొత్త లవ్ స్టోరీకి హీరో గా నితిన్ ఎంచుకున్నాడు.‘తొలిప్రేమ’ తో దర్శకుడిగా బిగిన్ అయిన వెంకీ అట్లూరి మిస్టర్ మజ్నూ లాంటి హిట్ మూవీ తీసి లవ్ స్టోరీ డైరెక్టర్ గా ఫేమస్ అయ్యారు. తన మూడో సినిమాను కూడా ఓ మంచి లవ్ స్టోనీనే కథాంశంగా ఎంచుకోవడం గమనార్హం.


ఇదిలా ఉండగా వెంకీ అట్లూరి ఎనౌన్స్ చేసిన  సరికొత్త మూవీకి ‘రంగ్ దే’ టైటిల్ ను ఎంచున్నాడు.  కలర్ ఫుల్ టిటిల్ కు  ‘గివ్ మి సమ్ లవ్’ అని ట్యాగ్ లైన్ పెట్టేసరికి మాస్ ఆడియన్స్ ఈ సినిమా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. అందునా వెంకీ అట్లూరి సినిమాలు ఎలా ఉంటాయో యూత్ కి కొత్త కాదు. చేసింది రెండు సినిమాలే అయినా ఆడియెన్స్ మైండ్ లో రిజిస్టర్ అయిపోయే సినిమాలనిచ్చాడు వెంకీ అట్లూరి. దీంతో  రంగ్ దే మూవీపై భారీ అంచనాలే పెట్టుకుంది చిత్రయూనిట్.