దేశానికి రెండో రాజధాని హైదరాబాద్‌ అంటూ వార్తలు హల్ చల్  చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధాని అంటూ వస్తున్న వార్తల్లో కూడా వాస్తవం లేదని ఆయన కొట్టి పారేశారు. బుధవారం హైదరాబాద్‌లో సనత్‌నగర్‌ ESIలో కొత్త బ్లాక్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో ఎదురైన ప్రశ్నకు  కిషన్‌ రెడ్డి ఈ మేరకు స్పందించారు. 


ఏపీ రాజధాని మార్పుపై కిషన్ రియక్షన్
ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో రాజధాని మార్పుపై చర్చ నడుస్తున్న సమయంలో ఈ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. రాజధాని మార్పుకు సంబంధించిన  అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదన్నారు. ఇది రాష్ట్ర పరధిలో అంశంమని చెబుతూనే ఈ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోదని వ్యాఖ్యానించారు. అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.