లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాగానే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారు. అమరావతిలో పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోరుకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు ఇచ్చారు