ఏలూరు: గత నెల 11వ తేదీ నుంచి 4 కేసులలో రిమాండ్ ఖైదీగా జిల్లా జైలులో ఉన్న టీడీపీ నేత, దెందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై మరో కేసు నమోదైంది. దళితుడిపై దాడికి పాల్పడ్డారనే కేసులో చింతమనేని రిమాండ్‌లో ఉండగానే పిటి వారెంట్‌ ఇచ్చి తిరిగి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఆయన మొత్తం ఐదు కేసుల్లో అరెస్ట్‌ అయినట్టుగా పోలీసు రికార్డులు చెబుతున్నాయి. 


పెదవేగిలో మాజీ సర్పంచ్‌ మేడికొండ కృష్ణారావును కిడ్పాప్‌ చేసి ఆయనపై దాడికి పాల్పడిన కేసులో చింతమనేనిని కోర్టు ఎదుట హాజరుపరచగా.. కోర్టు చింతమనేనికి ఈ నెల 9వరకు రిమాండ్‌ విధించింది.