విజయవాడ: గవర్నర్ నరసింహన్ తో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన మంత్రివర్గానికి సంబంధించిన జాబితాను అందజేశారు. జగన్ ప్రతిపాదించిన వారిపేర్లను గవర్నర్ యథతథంగా ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం జగన్ తన మంత్రివర్గంలో  25 మందికి  స్థానం కల్పించారు. ఇందులో ఐదుగురు డిప్యూటీ సీఎంగా అవాకాశం ఇచ్చారు. కాగా గవర్నర్ నరసింహన్  కొత్త మంత్రులకు రేపు ప్రమాస్వీకారం చేయించనున్నారు


ఇదిలా ఉండగా సచివాలయం సమీపంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మంత్రిపదవులు దక్కించుకున్న వారికి ఫోన్లు చేసి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం ఉదయం 11.49 గంటలకు ఉండనుంది. ఇదిలా ఉండగా మంత్రులు ప్రమాణస్వీకారోత్సవానికి సుమారు రెండు వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రతా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.