అమరావతి : ఏపీలో గత 24 గంటల్లో 71,137 కరోనా పరీక్షలు ( COVID-19 tests ) చేయగా అందులో 9,999 మందికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య మొత్తం 5,47,686 కి చేరింది. కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా గత 24 గంటల్లో మొత్తం 77 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 4,779 కి చేరింది. Also read : Revanth Reddy's open letter: సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖతో రేవంత్ రెడ్డి హెచ్చరిక


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24 గంటల్లో 11,069 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,46,716 మందికి చేరింది. Also read : Chalamalasetty Ramanjaneyulu: కరోనాతో టీడీపీ సీనియర్ నేత మృతి


[[{"fid":"192936","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


నేటి ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 44,52,128 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌‌లో ( Health bulletin ) పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 96,191 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ స్పష్టంచేసింది. Also read : AP: డ్వాక్రా మహిళలకు శుభవార్త.. ‘వైఎస్ఆర్ ఆసరా’ పథకానికి శ్రీకారం