శ్రీకాకుళం : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం పాల్గొన్న ఓ ప్రచార సభా వేదిక వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సభా వేదిక వద్ద షార్ట్ సర్క్యూట్‌ అయిన కారణంగానే మంటలు చెలరేగాయని తెలుస్తోంది. ఊహించని పరిణామంతో షాకైన జనసన వర్గాలు వెంటనే పవన్ కల్యాణ్‌ని అప్రమత్తం చేశాయి. దీంతో పవన్ వేదికపై నుంచి దిగి తన ప్రచార వాహనంపై ఎక్కి మిగతా ప్రసంగాన్ని పూర్తిచేశారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాలపై పవన్ కల్యాణ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 


ఓటమి భయంతోనే తన ప్రచార సభలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసిన పవన్... రాష్ట్రంలో ఇంకెక్కడా లేని విధంగా శ్రీకాకుళంలో మాత్రమే తన సభలకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.