Gunfire In Pulivendula, Kadapa: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. పులివెందుల మండ‌లంలో ఓ ఎంపీపీ కాల్పులు జరపగా, ఓ వ్యక్తి చనిపోయాడు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆస్తికి సంబంధించిన వివాదాలతో ఈ హత్య జరిగి ఉండొచ్చునని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కడప జిల్లా పులివెందుల మండ‌లం న‌ల్లపురెడ్డిప‌ల్లెలో కాల్పులు జరిగాయి. ఎంపీపీ శివ‌ప్రసాద్‌రెడ్డి తుపాకీతో వీరంగం చేశారు. పార్థసార‌థి అనే వ్యక్తిపై శివప్రసాద్‌రెడ్డి కాల్పులు (Gunfire In Pulivendula) జరిపి హత్యచేశారు. అనంతరం తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఆత్మహత్యాయత్నం చేసిన నిందితుడు శివప్రసాద్‌రెడ్డి గాయపడగా, చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Also Read: YSR Vahanamitra scheme: వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ఆర్థిక సాయం నేటి నుంచే ఖాతాల్లోకి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook