AP: విజయవాడ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత
విమానాశ్రయాల సాక్షిగా అక్రమ బంగారం స్మగ్లింగ్ ఎక్కువవుతోంది. ఏపీలోని రెండు ప్రధాన విమానాశ్రయాల్లో బంగారం పట్టుబడుతోంది. మొన్న విశాఖపట్నం ఎయిర్ పోర్ట్..నేడు విజయవాడ ఎయిర్ పోర్ట్.
విమానాశ్రయాల సాక్షిగా అక్రమ బంగారం స్మగ్లింగ్ ఎక్కువవుతోంది. ఏపీలోని రెండు ప్రధాన విమానాశ్రయాల్లో బంగారం పట్టుబడుతోంది. మొన్న విశాఖపట్నం ఎయిర్ పోర్ట్..నేడు విజయవాడ ఎయిర్ పోర్ట్.
కేరళ ( Kerala ) తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ ( Tiruvanantapuram airport ) లో భారీగా బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన సంఘటనలు తెలిసిందే. కేరళ గోల్డ్ స్కాం ( Kerala Gold scam ) ఆ రాష్ట్రంలో పెను ప్రకంపనాలు సృష్టించింది. ఇప్పుడు అదే అక్రమ బంగారం రవాణాకు ఏపీ విమానాశ్రయాలు వేదికగా మారుతున్నాయి. ఇటీవల కొద్దిరోజుల క్రితం విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ ( Visakhapatnam Airport ) లో భారీగా బంగారం పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ అందుకు వేదికైంది. ఇవాళ విజయవాడ ఎయిర్ పోర్ట్ ( Vijayawada Airport ) లో భారీగా బంగారాన్ని( Heavy gold seized ) రవాణా చేస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కువైట్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల్ని అనుమానంతో తనిఖీ చేయగా..ఏ విధమైన పత్రాలు లేని 1 కేజీ 865 గ్రాముల బంగారం దొరికింది. పట్టుబడిన బంగారం విలువ 95 లక్షల 11 వేల 5 వందలుంటుందని కస్టమ్స్ అడిషనల్ కమీషనర్ నాగేంద్రరావు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దర్ని అరెస్టు చేశామన్నారు. ఈ బంగారాన్ని ఎక్కడికి తరలిస్తున్నారనేది దర్యాప్తు చేస్తున్నామన్నారు. Also read: AP: చరిత్రలో నదీ స్నానాల్లేకుండా జరగనున్న తొలి పుష్కరాలు