Krishpatnam medicine: ఆనందయ్య మందు నేపధ్యంలో కంటి నుంచి డ్రాప్స్ వేసే విధానంపై చర్చ సాగుతోంది. అయితే ఈ విధానం ఆయుర్వేదంలో భాగమేనని తిరుమల తిరుపతి దేవస్థానం ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు ( Krishnapatnam Corona Medicine)ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పూర్తి స్థాయి అధ్యయనం కోసం తాత్కాలికంగా మందు పంపిణీ నిలిచిపోయింది. అయితే ఈ మందులో వాడే పదార్ధాలతో కానీ, మందుతో కానీ ఏ విధమైన దుష్ఫరిణామాలు ఉండవని ఆయుర్వేద వైద్యనిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఆనందయ్య మందు డ్రాప్స్‌ను కంటిలో వేయడంపై కాస్త చర్చ నడిచింది. దీనిపై టీటీడీ (TTD) వైద్య నిపుణులు స్పష్టతనిచ్చారు. కంటిలో డ్రాప్స్ వేయడమనేది ఆయుర్వేదంలో ఓ ప్రక్రియ అని..అలా వేస్తే మందు త్వరగా శరీరంలో చేరుతుందని చెబుతున్నారు. త్వరగా పూర్థిస్థాయిలో అధ్యయనం చేసి వివరాలు అందిస్తామన్నారు. మరోవైపు ఐసీఎంఆర్‌(ICMR)కు, ఆయుర్వేదానికి సంబంధం లేదని..కేంద్రంలో సీసీఎంఏఆర్ ఉంటుందని వారి అనుమతి తీసుకోవల్సి ఉంటుందని టీడీపీ ఆయుర్వేద నిపుణులు తెలిపారు.


ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే త్వరలో పూర్తిస్థాయిలో ఆనందయ్య మందు తయారీకు టీటీడీ ఆయుర్వేద నిపుణులు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆయుర్వేదంలో సైడ్‌ఎఫెక్ట్స్ ఉండవని..ఇప్పటికే ప్రాథమికంగా ఆయుష్ అనుమతిచ్చిందని చెప్పారు. ఆనందయ్య మందుపై (Anandaiah Medicine) యుద్ధ ప్రాతిపదికన నివేదిక సిద్దమవుతోంది.


Also read: Yaas Cyclone Alert: యాస్ తుపానుపై ముఖ్యమంత్రులతో అమిత్ షా సమీక్ష


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook