Yaas Cyclone Alert: యాస్ తుపానుపై ముఖ్యమంత్రులతో అమిత్ షా సమీక్ష

Yaas Cyclone Alert: యాస్ తుపాను ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తోంది. తుపాను కదలికల నేపధ్యంలో తీసుకోవల్సిన చర్యలపై తీర ప్రాంతాల ముఖ్యమంత్రులతో హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 24, 2021, 01:14 PM IST
Yaas Cyclone Alert: యాస్ తుపానుపై ముఖ్యమంత్రులతో అమిత్ షా సమీక్ష

Yaas Cyclone Alert: యాస్ తుపాను ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తోంది. తుపాను కదలికల నేపధ్యంలో తీసుకోవల్సిన చర్యలపై తీర ప్రాంతాల ముఖ్యమంత్రులతో హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు.

బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం..వాయుగుండంగా ..తుపానుగా మారుతోంది. యాస్ తుపానుగా (Yaas Cyclone) పిలుస్తున్న ఈ తుపాను 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుంది. ఈ నేపధ్యంలో తుపాను ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)వీడియా కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్( Ys Jagan) సమీక్షలో పాల్గొన్నారు. యాస్ తుపాను హెచ్చరిక దృష్ట్యా తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. తుపాను కదలికల్ని పరిశీలిస్తే ఏపీపై స్వల్ప ప్రభావముండే అవకాశాలున్నాయని వైఎస్ జగన్ తెలిపారు. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని ముందుకు సాగుతామన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని వైఎస్ జగన్ వివరించారు.

Also read: Singapore Aid:సముద్రమార్గం ద్వారా విశాఖకు చేరిన సింగపూర్ సహాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News