బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. పదునైన బ్రేడ్ తో వ్యక్తిపై ఓ దుండగుడు దాడి చేశాడు . దీంతో పాదచారులు భయంతో పరుగులు పెట్టారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ వ్యక్తికి ఆసుపత్రికి తరలించారు. సీఎం క్యాంపు కార్యాలయానికి సమీపంలోని  సూర్యాపేట పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలికాలంలో బెజవాడ  బ్లేడ్ బ్యాచ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.  ఒంటరిగా వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని బెదిరించి డబ్బులు కాజేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. గుంపుగా వచ్చే జనం జోలికి వెళ్లని ఈ బ్లేడ్ బ్యాచ్ ఒంటరిగా కనిపిస్తే మాత్రం వదిలిపెట్టరు. మొదట డబ్బులు అడుగుతారు. ఇవ్వకపోతే బ్లేడ్‌తో దాడిచేసి గాయపరుస్తారు. జేబులోని డబ్బులు, ఫోన్లు తీసుకుని పరారవుతారు.


ఇదిలా ఉండగా బ్లేడ్ బ్యాచ్ పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ వారి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. నగరంలోని పలు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని చెలరేగిపోతున్నారు.