చంద్రబాబు, పవన్ లకు లింక్ పెడుతూ వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రజాదరణ ఉన్న వైసీపీని ఓడించేందుకు టీడీపీ, జనసేన పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని విమర్శించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకరి నియోజకవర్గాల్లో మరోఒకరు ప్రచారం చేయకపోవడమే ఇందుకు నిరద్శనమన్నారు...కుప్పం, మంగళగిరిలో పవన్ ప్రచారం చేయరు. దీనికి బదులుగా గాజువాక, భీమవరంలో చంద్రబాబు ప్రచారం చేయరు..ఇది చాలదా వీరి  మధ్య బంధం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి అంటూ జగన్ ప్రశ్నించారు.


ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లతో ముడిపెడుతూ జగన్ పై టీడీపీ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ ఈ మేరకు టీడీపీ, జనసేన పార్టీలకు లింక్ పెడుతూ విమర్శలు సంధిస్తున్నారు.