అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీ-వామపక్ష పార్టీల మధ్య పొత్తు దిశగా చర్చలు ప్రారంభమయ్యాయి. నేడు జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీపీఎం తరపున మధు, సీపీఐ తరపున రామకృష్ణ పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల నేతలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ తరపున నాదేండ్ల మనోహర్ ఈ భేటీలో పాల్గొనగా పవన్ కల్యాణ్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.