జనసేన పార్టీలో పార్లమెంటు స్థాయి సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ కమిటీల ఏర్పాటును డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేస్తామని చెప్పారు. కాకినాడలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీలో కొత్తవారికి ప్రాధ్యాన్యత ఉంటుంది. ఏపీ, తెలంగాణల్లోని 42 లోక్‌సభ స్థానాల పరిధిలో 848 మందిని ఎంపిక చేశామని, వీరి శిక్షణ డిసెంబర్లో అయిపోతుందని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలను రెండు విడతలుగా ఏర్పాటు చేస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.