Pawan Kalyan: వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. రాయలసీమలో నేతల తీరు మారాలన్నారు. సీమలో పరిశ్రమ పెట్టాలంటే స్థానిక నేతలకు కప్పం కట్టాలని..పరోక్షంగా వైసీపీ నాయకులను ఉద్దేశించి మండిపడ్డారు. కప్పం కట్టకుంటే కియా పరిశ్రమపై దాడి చేసినట్లు దాడి చేస్తారని విమర్శించారు. గొడవల మధ్య రాయలసీమలో అభివృద్ధి చెందడం లేదన్నారు. సీమ యువత అంతా ఉపాధి కోసం బెంగళూరు, హైదరాబాద్ వెళ్తోందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కడప జిల్లాకు వెళ్తున్నామంటే యాత్ర ఎలా సాగుతుందనే చర్చ జరిగిందని..రాయలసీమలోకి కోస్తా ప్రజలు అడుగు పెట్టలేరనే భయం ఉందని చెప్పారు. జాతీయ భావాలతో ఉన్న తమకు ఎలాంటి భయం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ రాయలసీమ ఎందుకు వెనకబడి ఉందో నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. గత మూడురోజులుగా రాయలసీమ జిల్లాల్లో పర్యటించిన ఆయన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.


Also read:CM Jagan: పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి అయ్యేలా చూడండి..ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ..!


Also read:CPI Narayana: ఆయనో పెద్ద క్రిమినల్..ఎంతో మందిని హత్య చేయించారు..అమిత్ షాపై సీపీఐ నారాయణ ఫైర్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి