గుంటూరు:  జనసేన పార్టీ ఆవిర్భవించి నాలుగేళ్లు పూర్తయిన  నేపథ్యంలో ఆ పార్టీ అధినేత బహిరంగ ఏర్పాటు చేశారు. జనసేన ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఈ స్థాయిలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. దీంతో అందరీ చూపు పవన్ కల్యాణ్ పై ఉంది.  2019 ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జనసేన స్టాండ్ ఎలా ఉండబోతుంది ? ఈ వేదిక ద్వారా పవన్ జనాలకు పవన్ ఎలాంటి సందేశమిస్తారు. ప్రత్యేక హోదాపై ఎలాంటి కార్యచరణ ప్రకటిస్తారు. పొత్తులు, ఎత్తుల గురించి పవన్ ఏం మాట్లాడతారనే ప్రశ్నలకు పవన్ జమాధానమివ్వనున్నారు.  దీంతో పవన్ ప్రసంగం పై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.