జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే..!మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన నేడు పుట్టపర్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పుట్టపర్తి సత్యసాయి సేవలను కొనియాడారు. ఆయన కరువు జిలాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ఆదుకున్నారన్నారు. 


పుట్టపర్తి సత్యసాయిబాబా సేవలకు గుర్తింపుగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. సత్యసాయి పేరుతో కొత్త జిల్లా ఏర్పాటుచేస్తే అందుకు తాను సంపూర్ణ మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. కదిరి పర్యటనను ముగించుకొని పుట్టపర్తి చేరుకున్న పవన్ కళ్యాణ్-'విద్య,వైద్య,సంక్షేమ రంగాల్లో సత్యసాయి విశేష సేవలను అందిచారని, సత్యసాయిబాబా స్ఫూర్తి, ఆశీస్సులతో 'జనసేన' ముందుకు పోతుంది" అని చెప్పారు.