జనసేన పార్టీ వార్షికోత్సవ సభలో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ స్పందించాడు. పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో చెప్పిన అంశాలను స్వాగతిస్తున్నానని, జనసేనాని చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారని చెబుతూ పవన్‌ కల్యాణ్‌కు అభినందనలు తెలియజేశాడు కత్తి మహేశ్. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహార దీక్ష చేపడితే, ఆ దీక్షలో పవన్ కల్యాణ్‌కి తోడుగా తాను కూడా కూర్చుంటానని కత్తి మహేష్ స్పష్టంచేశాడు. పవన్ ఉపన్యాసంపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కత్తి మహేశ్ తన అభిప్రాయాన్ని నెటిజెన్స్‌తో పంచుకున్నాడు.