విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపికి చెందిన విజయవాడ ఎంపి కేశినేని నాని పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేకపోతే.. ఇక మీరు రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు ముఖ్యమంత్రి గారు అంటూ వ్యంగ్యంగా ఓ ట్వీట్ చేశారు. ''కార్పొరేషన్ ఉద్యోగుల జీతాలు బంద్'' అంటూ తాజాగా ఓ తెలుగు దినపత్రికలో ప్రచురించిన కథనాన్ని జతపరుస్తూ కేశినేని నాని ఈ ట్వీట్ చేశారు.