Krishnapatnam medicine report: కృష్ణపట్నం కరోనా మందుపై అధ్యయనం కొనసాగుతోంది. ఆనందయ్య తయారు చేస్తున్న మందు శాస్త్రీయతపై సందేహాలకు నివృత్తి లభిస్తోంది. ఆ మందు తయారీ పదార్ధాలన్నీ శాస్త్రీయమేని తేలింది. ఇంకా పరిశోధన కొనసాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం (Krishnapatnam)వైపే ఇప్పుడు అందరి చూపు నెలకొంది. కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న కరోనా మందు ఇప్పుడు చర్చనీయాంశమైంది. సీరియస్ కండీషన్‌లో ఉన్న కరోనా రోగులు సైతం ఈ మందుతో కోలుకుంటున్న పరిస్థితి ఉండటంతో జనం ఒక్కసారిగా పోటెత్తారు. అదే సమయంలో కృష్ణపట్నం మందు (Krishnapatnam medicine)శాస్త్రీయతపై సందేహాలు నెలకొనడంతో వైద్య బృందాలు రంగంలో దిగాయి. ఏపీ ప్రభుత్వం(Ap government) కూడా పూర్తి స్థాయి అధ్యయనం తరువాతే అనుమతి ఇస్తామంటోంది.


ఈ నేపద్యంలో ముందుగా ఆయుష్ వైద్యబృందం(Ayush team) అధ్యయనం ప్రారంభించింది. కృష్ణపట్నం ఊర్లో చాలామందితో మాట్లాడిన తరువాత ఆనందయ్య మందుతో ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేవని ప్రాథమికంగా తేల్చింది. అనంతరం మందులో వాడే పదార్ధాలు, తయరీలోని శాస్త్రీయతపై నిగ్గు తేల్చేందుకు అధ్యయనం కొనసాగిస్తోంది. ఆయుష్ కమీషనర్ రాములు ఆధ్వర్యాన ఈ పరిశోధన జరుగుతోంది. రాములు సమక్షంలోనే ఆనందయ్య మందు తయారుచేసి చూపించనున్నారు. మరోవైపు ఆనందయ్య మందు తయారీలో వాడే పదార్ధాల్ని ల్యాబ్‌కు(Lab report on anandaiah medicine) పంపి పరిశీలించారు. ఆ పదార్ధాలన్నీ శాస్త్రీయంగా ఉన్నాయంటూ ల్యాబ్ నుంచి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇక ఆ మందు తయారీలోని శాస్త్రీయతపై అధ్యయనం పూర్తి కావల్సి ఉంది. ఆటు ఐసీఎంఆర్(ICMR) వైద్య బృందం పరిశీలన కూడా పూర్తయిన తరువాత కో ఆర్డినేట్ చేస్తామని ఆయుష్ కమీషనర్ తెలిపారు. మొత్తం సమగ్ర నివేదికకు వారం రోజులు పడుతుందన్నారు. 


Also read; Krishnapatnam Medicine: కృష్ణపట్నం మందు బ్రేక్, పూర్తి స్థాయి అధ్యయనం తరువాత అనుమతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook