Jawad Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతూ..తుపాను హెచ్చరికలు జారీ చేస్తోంది. వాయుగుండంగా మారి..రేపటికి తుపానుగా మారనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌పై వరుణుడు పగబట్టినట్టు కన్పిస్తోంది. వరుస వర్షాలకు తోడు ఇప్పుడు తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం రేపటికి తుపానుగా మారనుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం అండమాన్ సముద్రంలో ఉన్న అల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశగా కొనసాగుతూ..తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరింతగా బలపడనుంది. అనంతరం వాయుగుండంగా మారి..రేపటికి తుపానుగా బలపడనుంది. డిసెంబర్ 4 వతేదీ ఉదయం ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటే అవకాశముంది.


ఈ తుపానుకు జవాద్‌గా (Jawad Cyclone)సౌదీ అరేబియా నామకరణం చేసింది. జవాద్ తుపాను కారణంగా రేపట్నించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. అటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాల హెచ్చరిక ఉంది. కోస్తాతీరం వెంబడి గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని ఐఎండీ(IMD)తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని..లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలనే సూచనలు జారీ అయ్యాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంటల్ని కాపాడుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం.


Also read: YS Jagan Schedule: వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ రెండ్రోజుల పర్యటన షెడ్యూల్ ఇలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook