విశాఖపట్టణం: ఆంధ్ర ప్రదేశ్‌లో జరగనున్న శాసన సభ, లోక్ సభ ఎన్నికలకు మరో 11 రోజులే మిగిలివున్న నేపథ్యంలో ఇవాళ విశాఖపట్నంలో ఏపీ సీఎం, టీడీపి అధినేత చంద్రబాబు చేపట్టిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కొద్దిసేపటిక్రితమే విశాఖకు చేరుకున్నారు. ఇంకాసేపట్లో ఆమె చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. దేశంలో ఎన్డీఏకి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న పార్టీల్లో దూకుడుగా వ్యవహరిస్తున్న వారిలో మమతా బెనర్జీ ఒకరు. 


విశాఖలో టీడీపి మద్దతుగా ప్రచారం చేపట్టనున్న ఆమె ఎవరిపై ఎటువంటి విమర్శల దాడికి దిగనున్నారా అనే ఉత్కంఠతో విశాఖ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.