పశ్చిమ గోదావరి జిల్లాలో  జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమ్మాయిలను వంచించి అశ్లీలంగా వీడియో తీసిన ఘటన కలకలం రేపుతోంది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం పేరుపల్లిలోని ఓ మొబైల్ షాపు యాజమాని  తమ గ్రామంలోని పలువురు యువతులు, మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి వారితో ఏకంగా గడువుతున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది గమనించిన అతని దగ్గర పనిచేస్తున్న మరో యువకుడు రహస్యంగా వీడియోలు చిత్రీకరించాడు. వాటిని తన ఫ్రెండ్ కు షేర్ చేయడం..అనంతరం వాటితో మొబైల్ షాపు యాజమానికి డబ్బులు ఇవ్వాలని వారు బెదిరించడం చేశారు. డిమాండ్ చేసిన డబ్బులు ఇచ్చేందుకు మొబైల్ షాపు యాజమాని ముందుకు రాకపోవడంతో వారు...  అమ్మాయిలతో అతను ఏకాంతంగా గడిపిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లోకి షేర్ చేశారు. 


వీడియో దృశ్యాలను వాట్సాప్ ద్వారా చూసిన ఓ బాధిత యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో  ఈ దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనపై స్థానిక పీఎస్ లో కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని..తల్లిదండ్రులు కూడా ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు.