Visakha RK beach: ఏపీలో విషాదం చోటుచేసుకుంది.  విశాఖ ఆర్కే బీచ్‌లో (Visakha RK beach) స్నానానికి దిగి ఐదుగురు గల్లంతయ్యారు. విహారయాత్ర కోసం ఆదివారం మధ్యాహ్నం ఒడిశాకు (odisha) చెందిన నలుగురు యువకులు, ఓ యువతి నగరానికి వచ్చారు. బీచ్‌లో సరదాగా గడిపారు. తర్వాత స్నానానికి దిగి అలల ధాటికి కొట్టుకుపోయారు. ఘటన జరిగిన అరగంటలోనే యువతి, యువకుడి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో ముగ్గురి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గజ ఈతగాళ్లు, లైఫ్‌ గార్డ్స్‌ను తీసుకొచ్చి..గాలింపు మెుదలపెట్టారు అధికారులు. మూడో పట్టణ సీఐ కోరాడ రామారావు నేవీ, మెరైన్‌ సిబ్బందికి సమాచారం అందజేశారు. గల్లంతైన వారి కోసం స్పీడ్‌ బోట్లు, హెలికాప్టర్‌ ద్వారా గాలించే అవకాశం ఉంది. ఒడ్డుకు వచ్చిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. వీరంతా న్యూఇయర్ వేడుకలు (New year Celebrations 2022) జరుపుకోవడానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీచ్ లోకి ఇతరులను దిగనివ్వకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. 


Also Read: New Year 2022: విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు- సెక్షన్ 144 అమలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook