జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం నవంబర్ 16వ తేదీ నుంచి 18వ తేదీవరకు లండన్ బయల్దేరి వెళ్లనున్నారు. అక్కడ ఇండియా, యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (ఐఈబీఎఫ్‌) ఆధ్వర్యంలో జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో 'గ్లోబల్ ఎక్సలెన్స్' అవార్డును స్వీకరిస్తారు. అలాగే అక్కడ జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారని ఆ పార్టీ మీడియా ఇంచార్జ్ పి.హరిప్రసాద్ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడు రోజుల పర్యటన వివరాలు


16వ తేదీ: పవన్ కళ్యాణ్ నవంబర్16న లండన్ చేరుకుంటారు.


17వ తేదీ: ఉదయం జీపీ హిందుజాతో సమావేశమవుతారు. మధ్యాహ్నం ‘భారత్‌- పెట్టుబడుల అవకాశాలు’ అనే అంశంపై జరిగే సభలో పాల్గొంటారు. సాయంత్రం ఐఈబీఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగే అవార్డుల ప్రదానోత్సవం, గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మీట్‌ న్యూ ఇండియా కార్యక్రమాలకు హాజరవుతారు.


18వ తేదీ: కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్ లో వివిధ యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటిస్తారు.