న్యూఢిల్లీ: ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అసెంబ్లీ ఎన్నికల తేదీ రానే వచ్చేసింది. ఏప్రిల్ 11న పార్లమెంట్ ఎన్నికలతోపాటే అసెంబ్లీకి సైతం ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. తొలి విడత పోలింగ్‌లో భాగంగా ఏపీ, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, అండమాన్ అండ్ నికొబార్, దాద్రా అండ్ నగర్ హవేలి, డామన్ అండ్ డయ్యు, లక్షద్వీప్, ఢిల్లీ, పుదుచ్చెరి, చండీఘర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.  


కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా ప్రకటించిన వివరాల ప్రకారం మార్చి 18న ఏపీ, తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా నెల రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నాయి.