AP Rains Forecast: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లటి వార్త ఇది. మండుతున్న ఎండలతో బెంబేలెత్తుతున్న ప్రజలకు వాతావరణ శాఖ నుంచి గుడ్‌న్యూస్. వరుణుడు పలకరించనున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఓ వైపు ఎండలు, మరోవైపు కరెంటు కోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ నుంచి చల్లని వార్త అందుతోంది. రానున్న మూడ్రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. 


దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉంది. ఇది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం కేంద్రంగా ట్రోపో ఆవరణం ఎత్తు వరకూ విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా ఏపీలో రానున్న మూడ్రోజులపాటు వర్షాలు పడతాయని సూచించింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇవాళ తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. రేపు ఇంకొన్ని ప్రాంతాల్లో, ఎల్లుండ మరికొన్ని ప్రాంతాల్లో వర్ష సూచన జారీ అయింది. దక్షిణ కోస్తాంధ్రలో ఇవాళ, రేపు, ఎల్లుండ వాతావరణం పొడిగా ఉండనుంది. ఇక రాయలసీమలో కూడా అదే పరిస్థితి, రేపు, ఎల్లుండ మాత్రం తేలికపాటి వర్షాలు పడవచ్చు.


Also read: CM Jagan: నా వెంట్రుక కూడా పీకలేరు... నంద్యాల సభలో చంద్రబాబు, పవన్‌లపై నిప్పులు చెరిగిన సీఎం జగన్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook