రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని  నారా లోకేశ్ కు టీడీపీ మహిళా నేత భూమా అఖిలప్రియ రాఖీ కట్టారు. అనంతరం అన్నయ్య అశీర్వాదం తీసుకున్నారు. రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్న అఖిలప్రియ... లోకేష్ కు స్వీట్ తినిపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉంటే ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్న లోకేష్.. అఖిల ప్రియ లాంటి సోదరి ఉండట నిజంగా తన  అదృష్టంగా భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అఖిలప్రియ తనకు రాఖీ కడుతున్న, స్వీట్ తినిపిస్తున్న ఫొటోలను జత చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.