గత కొద్ది రోజులుగా తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబ శివ రావు స్పందించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన .. మీడియాతో మాట్లాడారు.  ఇటీవలే తన కంపెనీ ట్రాన్స్ ట్రాయ్ మీద సీబీఐ దాడులు జరగడంతో ఇలాంటి ప్రచారాలు మొదలు పెట్టారని తెలిపారు. అలాంటి ఊహాగానాలను ఎవరు సృష్టిస్తున్నారో తనకు తెలుసన్నారు. ప్రస్తుతం పార్టీ మారే ఉద్దేశ్యం లేదని తెలిపారు. సీబీఐ దాడులకు సంబంధించి పెద్దగా స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఐతే సీబీఐ  విషయం కంపెనీ సీఈవో చూసుకుంటారని  చెప్పారు. సీబీఐ అధికారులు, సిబ్బంది ట్రాన్స్ ట్రాయ్ ఆఫీసు సహా తన ఇంట్లోనూ సోదాలు చేసుకుని వెళ్లారని తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..