Ap Covid Update: కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో తగ్గితే..కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ప్రతాపం చూపిస్తూనే ఉంది. కేసుల సంఖ్య పెరిగే కొద్దీ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. ఏపీలో రెండ్రోజుల్నించి కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న 21 వేల కేసులు బయటపడగా..తాజాగా 22 వేల 399 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో అత్యధికంగా 96 వేల 446మందికి పరీక్షలు నిర్వహించారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కరోనా కారణంగా 89 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 13 లక్షల 66 వేల 785 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో  కరోనా కారణంగా 9 వేల 77 మంది మరణించారు. గత 24 గంటల్లో ఏపీలో 18 వేల 638 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 11 లక్షల 56 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు.


ఏపీలో ఇప్పటి వరకూ 1 కోటి 77 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2 లక్షల 1 వేయి 42 యాక్టివ్ కేసులున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 3 వేల 372 కేసులు నమోదు కాగా చిత్తూరు జిల్లాలో 2 వేల 646, గుంటూరులో 2 వేల 141, అనంతపురంలో 2 వేల 80, విశాఖపట్నంలో 2 వేల 64 కేసులు నమోదయ్యాయి. 


Also read: Oxygen on Wheels: ఏపీలో వినూత్న పథకం, ఆక్సిజన్ ఆన్ వీల్స్ ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook