Mohanbabu- Manchu Vishnu: ఏపీలో సాగుభూమిలేని నిరుపేదలకు కేటాయించే దరఖాస్తు పట్టాలను సినీ ప్రముఖులకు మంజూరు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నటుడు మోహన్‌బాబు (Mohanbabu), ఆయన కుమారుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుల పేరిట దరఖాస్తు పట్టా భూములు మంజూరు చేసినట్టు ఆన్‌లైన్‌ రెవెన్యూ రికార్డుల్లో బహిర్గతమైంది. దీంతో ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆ వివరాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో (Social Media) పెట్టి ‘సినీ ప్రముఖులు కూడా నిరుపేదలా?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిత్తూరు జిల్లా (Chittoor District) చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి-68 గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 412-1ఎలోని 2.79ఎకరాలను ఎం.మోహన్‌బాబు పేరిట, 412-1బిలో 1.40ఎకరాలను విష్ణు (Manchu Vishnu) పేరిట దరఖాస్తు పట్టా జారీ చేశారు. 2015లో దరఖాస్తు పట్టాలు మంజూరు చేయగా.. ఆ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీనిపైౖ తహసీల్దారు శిరీషను వివరణ కోరగా.. పూర్తి వివరాలు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. 


Also Read: Mohan Babu vs Naga Srinu: మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతుంది.. ? దొంగతనం నుండి కుల దూషణ.. ఎవరు కరెక్ట్ ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook