టీటీడీ బోర్డుకు సంబంధించిన ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ బోర్డులో ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వులను అనుసరించి ప్రత్యేక ఆహ్వానితులకు బోర్డు సభ్యులతో సమానంగా ప్రోటో కాల్ వర్తిస్తుంది. అయితే పాలకమండలి తీర్మానాల్లో మాత్రం వీరికి ఓటు హక్కు ఉండదు. కాగా ప్రత్యేక ఆహ్వానితులు ఎంపికైన వారిలో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి చోటు దక్కింది. అయనతో పాటు మరో ఆరుగురు స్థానికేతరులకు చోటు దక్కింది.


ప్రత్యేక ఆహ్వానితులు వీరే..
* భూమన కరుణాకర్ రెడ్డి (చిత్తూరు)
* ఏజే శేఖర్ రెడ్డి (చెన్నై)
*గోవిందపురి (హైదరాబాద్)
* కుపేందర్ రెడ్డి (బెంగళూరు)
* రాకేశ్ సిన్హా (ఢిల్లీ)
* దుశ్మంత్ కుమార్ దాస్ (భువనేశ్వర్)
* అమోల్ కాలే (ముంబై)