ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతి కోసం తమ భూములను ధారాదత్తం చేసిన రైతులకు ప్రభుత్వం సువర్ణావకాశం కల్పిస్తోంది. వారిని త్వరలో సింగపూర్ ట్రిప్‌కు ప్రభుత్వం తీసుకెళ్ళనుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలియజేశారు. దాదాపు 100 పైగా రైతులను లాటరీ ద్వారా ఎంపిక చేసి, వారికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. సీఆర్‌డీఏ కార్యాలయంలో ఆదివారం  మధ్యాహ్నం జరిగిన లాటరీ కార్యక్రమంలో కమీషనర్‌తో పాటు మంత్రి కూడా పాల్గొ్న్నారు. సింగపూర్ నగరం ఎలా అత్యద్భుత స్థితికి చేరుకుందో ఈ పర్యటన ద్వారా రైతులకు కూడా వివరిస్తామని.. అమరావతి అభివృద్ధి కూడా ఆ స్థాయిలో ఉంటుందనే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం కోసం ఈ పర్యటన ఆయన ఈ సందర్భంగా తెలిపారు.