జగన్ సర్కార్ అనుసరిస్తున్న రివర్స్ టెండరింగ్ ప్రక్రియపై చంద్రబాబు స్పందించారు. కాకినాడ పర్యటనలో ఉన్న ఆయన... జగన్ సర్కార్ పాలనా తీరుపై మరోమారు విమర్శలు సంధించారు. జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ అంటూ రాష్ట్రాన్ని రివర్స్ చేస్తోందని దుయ్యబట్టారు. పోలవరం భవిష్యత్తును ప్రశ్నార్థంగా మార్చేశారని... రాజధాని అమరావతిని దారుణ స్థితికి తెచ్చారని చంద్రబాబు ఆరోపించారు. భవిష్యత్తు తరాలను దృష్ఠిలో ఉంచుకొని తాను చేపట్టిన కార్యచరణను ...జగన్ సర్కార్ ఇలా నిర్వీర్వం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.  చంద్రబాబు హయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల టెండరింగ్ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలుగా జరిగాయని  భావిస్తున్న జగన్ సర్కార్... రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్న విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో చంద్బబ్రాబు ఈ మేరకు స్పందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది రాక్షస ప్రభుత్వం..


కాకినాడలో జరుగుతున్న తూర్పుగోదావరి జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో భాగంగా  పాల్గొన్న చంద్రబాబు టీడీపీ నేతలు,కార్తలకర్తలపై జరగుతున్న దాడులను ప్రస్తావిస్తూ జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇలాంటి రాక్షస ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. రాష్ట్రా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారని ..వైసీపీ పై ఆరోపణలు సంధించిన చంద్రబాబు.... ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే తూగో జిల్లాలోనూ దాడులు జరగడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని హత్యకేసును ఇప్పటి వరకు తేల్చలేకపోయాని విమర్శించారు. వైఎస్ వివేకాను ఆయన ఇంట్లోనే చంపినప్పటికీ... ఇంత వరకు ఎవరు చంపారో కనిపెట్టలేక పోయారని ఎద్దేవా చేశారు.