ఎన్నికల సమయంలో దాడులపై  టీడీపీ నేత కోడెల శివప్రసాద్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తనపై జరిగిన దాడి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.  ఇనిమెట్ల పోలింగ్ స్టేషన్ లో వైసీపీ వారు తన పై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని వివరించారు. దీనికి సంబంధించిన వినితిప్రతాన్ని గవర్నర్ కు అందించారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గవర్నర్ తో భేటీ అనంతరం కోడెల మీడియాతో మాట్లాడారు.  ఏపీ ఎన్నికల్లో జరిగిన హింస, ఘర్షణల గురించి గవర్నర్‌కు వివరించినట్టు తెలిపారు.  ఏపీలో అధికార పక్షానికి గవర్నర్ చాలా బాగా సహకరించారని కొనియాడారు


ఇనిమిట్ల ఘటనను ప్రస్తావిస్తూ వైపీపీ వారు కూడా గవర్నర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు చేసిన అనంతరం కోడెలపై పీఎస్ లో కేసు నమోదు వంటి పరిణామాలు చోటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కోడెల గవర్నర్ తో భేటీ ప్రాధాన్యత  సంతరించుకుంది