ఏపీలో టీడీపీ-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా  టీడీపీ ఎమ్మెల్యే అనిత హాట్ హాట్ గా స్పందించారు. బీజేపీ ఎమ్మెల్సీ మధవ్ కు చంద్రబాబు విమర్శించే స్థాయి లేదన్నారు. అసలు బీజేపీకి రాష్ట్రంలో ఆ మాత్రం సీట్లు వచ్చాయంటే..అది టీడీపీ పుణ్యమేనన్నారు. టీడీపీపై విమర్శలు చేస్తున్న మధవ్ కు దమ్ముంటే తన పదవికి రాజనామా చేసి టీడీపీ మద్దతు లేకుండా గెలవాలని సవాల్ విసిరారు. మంత్రి వర్గం నుంచి బయటికి వెళ్లడమనేది బీజేపీ వాళ్ల సొంత నిర్ణయమన్నారు.