నవ్యాంధ్ర రాజధాని మార్పుపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ అంశంగా జగన్ సర్కార్ ను తీవ్ర స్థాయిలో ఎండగడుతున్నాయి. తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని రాజధాని మార్పు అంశంపై స్పందిస్తూ ముఖ్యమంత్రి జగన్ మరో తుగ్లక్ కాకూడదని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు సెటైర్లు సంధించారు. ఈ సందర్భంగా మొహమ్మద్ బిన్ తుగ్లక్ చరిత్ర ను ప్రస్తావిస్తూ...1328లో తుగ్లక్ రాజు దేశ రాజధాని ఢిల్లీ నుంచి  మహారాష్ట్ర లోని దౌలతాబాద్ కు తరలించాడు... తిరిగి అక్కడి నుండి మళ్లీ ఢిల్లీ కి మార్చాడు. అమరావతి విషయంలో కూడా  జగన్ వైఖరి కూడా ఇలాగే ఉందనే కోణంలో టీడీపీ ఎంపీ కేశినేని ఎద్దేవ చేశారు.