ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎంపీ మురళీ మోహన్‌ ఢిల్లీలో అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడిన అనంతరం లోక్‌సభ స్పీకర్ కార్యాలయం వద్ద టీడీపీ ఎంపీలు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎంపీల దీక్షను భగ్నం చేసిన మార్షల్స్.. స్పీకర్ కార్యాలయం నుంచి వారిని బలవంతంగా బయటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే అస్వస్థతకు గురైన మురళీ మోహన్.. అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. దీంతో పార్లమెంట్ సహాయక సిబ్బంది సహాయంతో టీడీపీ నేతలు ఆయన్ను అంబులెన్స్‌లో సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. 


మురళీ మోహన్‌ని ఏ ఆస్పత్రికి తరలించారు ? ప్రస్తుతం పరిస్థితి ఏంటనే వివారాలకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి వుంది.