Coronavirus: కరోనా మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. వీవీఐపీలు, సెలెబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. నిన్న నారా లోకేష్ కరోనా వైరస్ బారిన పడగా..ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు సైతం కరోనా బారిన పడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా థర్డ్‌వేవ్ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా సెలెబ్రిటీలు, రాజకీయ నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) కుమారుడు నారా లోకేష్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇవాళ చంద్రబాబు సైతం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా తప్పకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని..ఐసోలేషన్‌లో ఉండాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని..కోవిడ్ లక్షణాలు(Corona Symptoms)స్వల్పంగా ఉన్నాయని ట్వీట్ చేశారు. ప్రస్తుతం తాను క్వారెంటైన్‌లో ఉన్నానని..అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపారు.



Also read: Nara Lokesh Corona: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కరోనా పాజిటివ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి