Chandra Babu Naidu Kuppam House : చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు సొంత ఇల్లు నిర్మించుకుంటే చూడాలన్న నియోజకవర్గ ప్రజల కల త్వరలోనే తీరనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందుకు అవసరమైన స్థలం రిజిస్ట్రేషన్‌కోసం సంబంధిత పత్రాలపై చంద్రబాబు సంతకం కూడా అయిపోయింది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న వివరాల ప్రకారం.. కుప్పం-పలమనేరు జాతీయ రహదారి సమీపంలో శాంతిపురం మండల పరిధిలోని కడపల్లె, కనమలదొడ్డి గ్రామాల మధ్య శివపురం ఎదురుగా 2.10 ఎకరాల స్థలాన్ని చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణం కోసం కొనాలని నిర్ణయించారు.


కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబు గురువారం ఉదయం ఆ స్థలం రిజిస్ట్రేషన్‌ పత్రాలపై సంతకాలు చేసి వేలిముద్రలు వేశారు. ఈనెల 29న స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జూన్‌ 5న చంద్రబాబు, తన సతీమణి భువనేశ్వరితో కుప్పం వచ్చి ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. 


ఇక్కడ గృహంతోపాటు పార్టీ సమావేశాల కోసం ప్రత్యేకంగా కార్యాలయ భవనం కూడా నిర్మించనున్నారు.


Also Read - Keerthy Suresh Latest Pics: బటన్స్ విప్పేసిన కీర్తి సురేష్.. అయినా కళకళలాడుతున్న కళావతి!


Also Read - Nani-Nazriya Nazim: నాని, న‌జ్రియా ఫ‌న్నీ ఛాలెంజ్.. వీడియో చూస్తే నవ్వులే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook