కర్నూలు: చిత్తూరు నుంచి తిరుపతి మీదుగా కాచిగూడకు బయల్దేరిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు కర్నూలు రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం తెల్లవారిజామున 2:30 గంటల సమయంలో కర్నూలు రైల్వే స్టేషన్‌ వద్ద వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైల్ ఇంజన్‌ పట్టాలు తప్పింది. అయితే, లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో అదృష్టవశాత్తుగా రైలు ప్రయాణికులకు ఎటువంటి హానీ కలగలేదు. 


ఊహించని పరిణామంతో ఖంగుతిన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం కారణంగా పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.