అమరావతి: ప్రజా చైతన్య యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యాత్రలో భాగంగా చిత్తూర్ జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విందు ఇస్తోన్న నేపథ్యంలో ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను మాత్రం ఆహ్వానించలేదని అన్నారు. దీనిపై స్పందించిన చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


రాష్ట్రపతి భవన్ నుండి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందకపోవడంపై ముందుగా ఈ అంశం గూర్చి విలేకరులు ఏమనుకుంటున్నారని, నా కామెంట్‌ కంటే మీ కామెంట్ ముఖ్యం కదా.. అని వారిని ప్రశ్నించారు. తెలంగాణ కంటే, ఏపీ పెద్ద రాష్ట్రమని,  అయినప్పటికీ ఆహ్వానం అందలేదన్నారు. అమెరికా చట్టాలు కూడా చాలా కఠినంగా ఉంటాయని, కేసులుండే వ్యక్తులను కలవరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..