సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పై వైసీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబుతో కుమ్మకయ్యారని అందుకే ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టకుండా ఉంచారని ఆరోపించారు. కిరణ్ సర్కార్ ను పడగొట్టే అవకాశమొచ్చినప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు అలా చేయలేదని.. జగన్ సీఎం అవుతారనే భయంతో చంద్రబాబు అలా చేశారని ఆరోపించారు.   అందుకు కృతజ్ఞతగా ఇప్పుడు చంద్రబాబుకు కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం మద్దతు ఇస్తోందన్నాదని ఆరోపించారు. తన ఆరోపణల్లో వాస్తవం లేకుంటే అప్పట్లో చాన్స్ వచ్చినా కూడా కిరణ్ ప్రభుత్వాన్ని పడగొట్టకుండా ఎందుకు మౌనంగా ఉన్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని  ఈ సందర్భంగా వైసీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు డిమాండ్ చేశారు.


ఇటీవలికాలంలో కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి పోరాటపటిమ ప్రదర్శించారని కొనియాడారు. ఇలా చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి మధ్య రిలేషన్ డెవెలప్ అవుతున్న సయమంలో వైసీపీ ఈ మేరకు ఆరోపణలకు దిగింది.