జగన్ సర్కార్ రాజధాని ప్రాంతంలో కావాలనే కృత్రిమ వరదలను సృష్టించిందని టీడీపీ నేతల ఆరోపణలపై విజయవాడకు చెందిన వైసీపీ నేత పీవీపీ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఉద్దేశించి మాట్లాడుతూ ... సర్జీ ...కృతిమ  వరదలు పుట్టించడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి ఆరోపణలు చేస్తున్న వారు ఐస్మార్ట్ చిప్పులు పెట్టుకోవాలంటూ వైసీపీ నేత పీవీపీ సెటైర్లు వేశారు.  చంద్రబాబు గారు ప్రజాక్షేమం కోరే పెద్దలు మీరు.... ప్రపంచంలో కెల్లా శ్రేష్ఠమైన పప్పులను తయారుచేసి వదులుతున్నారు... కృతిమ  వరదలు హాహాకారాలు పెడుతున్నారు  వారంతా అంటూ టీడీపీ నేతలను ఉద్దేశించి పీవీపీ ఎద్దేవ  ఎద్దేవ చేశారు.



వరదలు ముంచుకురావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులను పరామర్శించి జగన్ సర్కార్ కావాలనే కృత్రిమ వరదలను సృష్టిస్తోందని ఆరోపించారు. అమరావతిని వదర ప్రాంతంగా చిత్రీకరించి రాజధానిని మార్చాలనే కుట్రతోనే ఇలా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు బాటలోనే టీడీపీ నేతలు కూడా ఇది కృత్రిమ వరదలంటూ  వైసీపీ సర్కార్ పై విమర్శలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైపీపీ నేత పీవీపీ ఈ మేరకు స్పందించారు.