హైదరాబాద్: అధికారపార్టీ జగన్ కుటుంబంపై కక్షకట్టిందని వైసీసీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు ఆరోపించారు.  వైసీపీ కార్యాలయంలో ఈ రోజు  జరిగిన మీడియా సమావేశంలో సుధాకర్ మాట్లాడారు. గతంలో వైఎస్సార్ మరణంపై ఉన్న అనుమానాలకు ఇప్పటి వరకు నివృత్తి చేయలేదని..ఇప్పుడు తాజాగా జగన్ ను హతమార్చేందుకు కుట్రపన్నారని విమర్శించారు. జగన్ దాడి కేసులో చంద్రబాబే మొదటి ముద్దాయి అని అరోపించారు. ప్రతిపక్ష నేత జగన్ కు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేకే టీడీపీ హత్యాయత్నం చేయించిందని మండిపడ్డారు. 


నటుడు శివాజీ చెబుతున్న ‘ఆపరేషన్ గరుడ’ సృష్టికర్త చంద్రబాబేని సుధాకర్ బాబు ఆరోపించారు. శివాజీని విచారిస్తే ఎక్కడ నిజాలు బయటపడతాయో అని చంద్రబాబు భయపడుతున్నాని వ్యాఖ్యానించారు. దాడి గురించి ముందే బయటపెట్టిన శివాజీని విచారిస్తే నిజాలు బయటపడతాయని..ఆ దిశగా విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. జగన్ హత్యకు కుటుంబ సభ్యులే ప్రయత్నించారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలకు ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని వైసీపీ నేత సుధాకర్ బాబు విమర్శించారు.