హైదరాబాద్: గత కొన్ని రోజులుగా (TDP vs YSRCP) టీడీపీ వైసీపీల మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకొంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే హీరో బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వ విప్‌ కే.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. మధ్య గడిచిన ఏడాదిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తమ ప్రభుత్వంపై ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, బాలకృష్ణ మానసిక పరిస్థితిపై అనుమానాలు ఉన్నాయని తాడేపల్లిలోని వైఎస్సార్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో శుక్రవారం మాట్లాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: TTD rules post lockdown: లాక్‌డౌన్ తర్వాత టిటిడి భక్తులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు


కాగా ఇప్పటికే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయాయారని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మానసిక పరిస్థితిపై ప్రభుత్వానికి లేఖ రాస్తానని అన్నారు. ఎన్టీఆర్‌ కుమారుడిగా బాలకృష్ణపై అభిమానం ఉందని, ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ప్రవర్తించాలని సూచించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..