కోడెల స్మారక సభలో కూడా రివర్స్‌ టెండరింగేనా ?- విజయసాయిరెడ్డి

జగన్ సర్కార్ పై టీడీపీ చేస్తున్న ఆరోపణలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధీటుగా బదులిచ్చారు

Last Updated : Oct 1, 2019, 01:21 PM IST
కోడెల స్మారక సభలో కూడా రివర్స్‌ టెండరింగేనా ?- విజయసాయిరెడ్డి

చంద్రబాబు తీరుపై విజయసాయరెడ్డి ట్విట్టర్ వేదికగా  మరోమారు ధ్వజమెత్తారు. కోడెల స్మారక సభలో కూడా చంద్రబాబు  పోలవరం రివర్స్‌ టెండరింగునే కలవరించరని విమర్శించారు. గతంలో రూ. 650 కోట్లు ఎక్కువ కోట్ చేసిన మేఘా సంస్థ ఇప్పుడు తక్కువకు ఎలా కోట్‌ చేస్తుందని టీడీపీ వారు గగ్గోలు పెడుతున్నాడు. అప్పుడు మీరు   కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారు...కానీ వైసీపీ హయంలో ఎవరికీ రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు. అదీ తేడా అంటూ టీడీపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి.

చీకటి పాపం మీదే కదా...!!
విభజన జరిగిన తర్వాత రాష్ట్రాన్ని ఆదుకుంటారని....అనుభవజ్ణుడని నమ్మి ప్రజలు చంద్రబాబును గెలిపిస్తే... ఏపీని నిలువునా మోసం చేశారని దయ్యబట్టారు. చంద్రబాబు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావు....ఎన్టీపీసీ సహా విద్యుత్తు సంస్థలకు రూ.20 వేల కోట్లపైనే బకాయిలు పెట్టి పోయారని దయ్యబట్టారు. అలాగే జెన్‌కోను ధ్వంసం చేసిన చంద్రబాబు  ప్రైవేటు కంపెనీలకు దోచిపెట్టారని విమర్శించారు.డిస్కమ్‌లను అప్పుల్లో ముంచి ఇప్పుడు చీకటి రోజులొచ్చాయని దొంగ ఏడుపు మొదలెట్టారని చంద్రబాబు తీరును విజయసాయిరెడ్డి ఎండగట్టారు.

 

 

 

Trending News